కావలసిన పదార్థాలు:
పప్పు –మూడుకప్పులు
మామిడికాయ -పెద్దది ఒకటి
ఆవాలు -పావు స్పూన్
జీలకర్ర-పావు స్పూన్
మెంతులు-పావుస్పూన్
ఎండుమిర్చి –రెండు
పచ్చిమిర్చి –రెండు
కరివేపాకు -రెండు రెమ్మలు
ఆయిల్ -రెండు స్పూన్స్
ఉప్పు –తగినంత
వెల్లుల్లి పాయలు –రెండు
కొత్తిమీర –కొద్దిగా
తయారీ పద్ధతి :పప్పుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పకనపెట్టాలి .మామిడి కాయకి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ఉడక బెట్టాలి .మెత్తగా మెదిపి పప్పులో వేసి కలపాలి.స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి పాయలు వేసి వేగనివ్వాలి.తరువాత ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు ,మెంతులు ,ఎండుమిర్చి ,పచ్చిమిర్చివేసి వేగాక పోపుని పప్పులో కలపాలి .పప్పుని స్టవ్ మీద పెట్టి మూడు నిముషాలు మరిగించాలి స్టవ్ సిం లోనే ఉండాలి .తగినంత ఉప్పు వేసి కలపాలి .స్టవ్ ఆఫ్ చేసి సేర్విగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి .
యిది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .
Discover more from Speaking Data
Subscribe to get the latest posts to your email.