కావలసిన పదార్థాలు :
అరటి కాండం… 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)
నిమ్మకాయలు… 15 కాయలు
ఎండు మిరపకాయలు… 50 గ్రా.
ఆవాలు… 50 గ్రా.
పెరుగు… 250 మిలీ
పసుపు… 5 గ్రా.
ఉప్పు… 25 గ్రా.
కరివేపాకు… సరిపడా
పోపుదినుసులు… సరిపడా
తయారీ విధానం :
ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.
ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి మంచిది. అంతేగాకుండా ఇది దోసె, చపాతీలకు కూడా భలే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా.
Discover more from Speaking Data
Subscribe to get the latest posts to your email.