కావలసిన పద్దార్దాలు :
బియ్యం -రెండు కప్పులు
పెసర పప్పు -రెండు కప్పులు
మినప పప్పు -ఒక కప్పు
సెనగ పప్పు -ఒక కప్పు
జొన్నలు –ఒకకప్పు
గోధుమలు -ఒక కప్పు
మెంతులు -నాలుగు చెంచాలు
జీలకర్ర -నాలుగు చెంచాలు
ఇంగువ -ఒక చెంచా
ఎండుమిర్చి –14
పంచదార -నాలుగు చెంచాలు
పుల్లపెరుగు -నాలుగు కప్పులు
ఉప్పు – సరిపడ
తయారీ పద్దతి :బియ్యం ,పెసర పప్పు ,మినపపప్పు ,శెనగపప్పు,జొన్నలు ,గోధుమలు ,మెంతులు వీటిని రాత్రి నాన బెట్టి ఉదయ్యన్నే నీరుతీసి ఇంగువ ,ఎండుమిర్చి ,జీలకర్ర వేసి దోస పిండిలా రుబ్బాలి .దీనికి పంచదార ,ఉప్పు ,బాగాచిలికిన పెరుగు చిక్కగా వేసి బాగా కలిపి ఆరు గంటలు నాన బెట్టాలి .తర్వాత కాలిన పెనం మీద పల్చటి దోసెలు వేసి అటు ఇటు కాల్చి వేడి వేడిగ సర్వ్ చేయాలి .
Discover more from Speaking Data
Subscribe to get the latest posts to your email.